ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్లు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ ఎర్రి గట్టమ్మ దేవాలయ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. హనుమకొండ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఓ కారు ఎటునాగారం నుంచి హనుమకొండ వైపు వస్తున్న మరో కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో పాటు అదే దారిన వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టాయి. ఈ క్రమంలో కార్ల వెనుక వైపు నుంచి వస్తున్న మరో కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి కూడా గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.