ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని షాంపూర్ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.