చెన్నై : హీలియం ట్యాంక్ పేలడంతో ఓ వ్యక్తి మరణించిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో వెలుగుచూసింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన బెలూన్లు కొంటున్న వ్యక్తి మరణించగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. నగరంలోని రద్దీ ప్రాంతంలో ఘటన జరగడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీయడం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది.
#WATCH | Tamil Nadu: A helium tank exploded in a market in Trichy's Kotai Vasal area yesterday; One dead & several injured. Case registered. pic.twitter.com/wUHvlaM5GQ
— ANI (@ANI) October 3, 2022
మృతుడిని 35 ఏండ్ల రవిగా గుర్తించారు. నిర్లక్ష్యంతో వ్యక్తి మరణానికి కారణమయ్యాడనే అభియోగంపై బెలూన్ల విక్రేతను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చిలోని ఫోర్ట్ ప్రాంతంలో టెక్స్టైల్ షోరూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో పేలుడు ఘటన రికార్డైంది. టెక్స్టైల్ షోరూం వెలుపలనే విక్రేత బెలూన్లను అమ్ముతున్నాడు. పేలుడు ఘటనతో ప్రజలు తలో దిక్కు పరుగెడుతున్న దృశ్యాలు కనిపించాయి. పేలుడు ఘటనలో ఓ ఆటోతో పాటు పలు బైక్లు దగ్ధమయ్యాయి.