అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని దవాఖానకు తరలించామని వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ఉన్నారని సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.