హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గోండులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ. ఒక కోటి మంజూరుచేశారు. ఈ నిధుల నుంచి దండారీ పండుగ నిర్వహించే ప్రతి గోండు గూడేనికి రూ.10 వేల చొప్పున అందజేస్తారు.