ఢిల్లీ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక కోటి 11 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. వీటిలో 73 లక్షలు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపగా.. 43 లక్షలకు పైగా ఇళ్లను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి స్పందిస్తూ.. 2022 నాటికి అందరికి ఇళ్లు అనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలను సాకారం చేసేందుకు దృష్టి సారించినట్లు తెలిపారు. మెరుగైన ఇళ్లు మహిళా జీవితాలను తద్వారా కుటుంబ జీవన ప్రమాణాలను ప్రభావితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.