అమరావతి : అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఇవాళ ఐదో రోజుకు చేరుకుంది. బాపట్ల జిల్లాలోని కొల్లూరులో రైతుల పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఈ యాత్ర వెల్లటూరు మీదుగా సాయంత్రం ఐలవరం గ్రామం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో టీడీపీ నాయకులు నక్కా ఆనంద్బాబు, ధూళిపాల్ల నరేంద్ర, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
ఏపీ సీఎం జగన్ మరోసారి అసెంబ్లీ సాక్షిగా మరోసారి అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతికి అంగీకరించి అధికారంలోకి వచ్చిన తరువాత మాటా మార్చారని పేర్కొన్నారు. నిన్న అసెంబ్లీలో ప్రాంతాల మధ్య విద్వేషా లు రెచ్చగొట్టేలా మాట్లాడారని తెలిపారు. దేవునికి కూడా ప్రాంతాలను ఆపాదించడం దారుణమని ఆరోపించారు. రైతుల పాదయాత్రలో మహిళలు ఉత్సాహంగా పాదం పాదం కలుపుతూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
యాత్ర కొనసాగుతున్న దారి వెంట గ్రామాల ప్రజలు, యువత యాత్రకు ఘన స్వాగతం పలుకుతున్నారు. రాజధాని కోసం ఆందోళనలు చేపట్టి వేయి రోజులు పూర్తయిన సందర్భంగా రెండో దశ పాదయాత్రను అమరావతి నుంచి అరసాపల్లి వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే .