Commonwealth Games | కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్హోంలో ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి. గేమ్స్ ప్రారంభానికి ముందే రెండురోజుల ముందే భారత్కు షాక్ తగిలింది. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా క్రీడలకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రాజీవ్ మెహతా ధ్రువీకరించారు.
నీరజ్ చోప్రా వందశాతం ఫిట్గా లేనందున క్రీడలకు దూరమవుతున్నాడని పేర్కొన్నారు. ఇటీవల నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్కు రజత పతకాన్ని అందించాడు. అంజు బాబీ జార్జ్ (2003) తర్వాత పతకాన్ని అందించిన రెండో అథ్లెట్గా నిలిచాడు. ఈ టోర్నీలోనే నీరజ్ చోప్రా గాయపడ్డాడు.