ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు ఓ రేంజ్లో తగలబడుతున్నాయి. దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా సీరియస్ అయ్యారు. అసలు లోపం ఎక్కడుందో అధ్యయనం చేయాలని ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇక.. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడుతుండటంతో ఓలా యాజమాన్యం అప్రమత్తమైంది. తమకు సంబంధించిన 1,441 యూనిట్ల నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 26న పూణెలో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని సంస్థ పేర్కొంది.
ఇక రీకాల్ చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను పూర్తి అధ్యయనం చేస్తామని, వాటి స్థితిగతులపై నిర్దిష్టమైన ప్రణాళికలతో ఈ అధ్యయనం వుంటుందని ఓలా యాజమాన్యం పేర్కొంది. మా కంపెనీకి చెందిన సర్వీసు ఇంజినీర్లు ఇదే పనిలో నిమగ్నమై ఉంటారు. బ్యాటరీతో సహా.. అన్ని సిస్టంలకు సంబంధించి.. పరీక్షలు చేస్తాం. తమ బ్యాటరీ పనితీరు విధానం కూడా మన దేశానికి సరిపోయేట్లు ఉంది. ఇప్పటికే పరీక్షలు కూడా నిర్వహించేశాం అని ఓలా పేర్కొంది.