న్యూఢిల్లీ, జనవరి 6: దేశవ్యాప్తంగా ఈ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఓలా.. తన ఉత్పత్తి సామర్థ్యాన్ని అమాంతం పెంచింది. రోజుకు వెయ్యి స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భావిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బెంగళూరు ప్లాంట్లో ఉత్పత్తి అయిన స్కూటర్ల ఫొటోను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తొలి విడత బుకింగ్ చేసుకున్న వారికి ఇప్పటికే డెలివరీ ప్రారంభించినట్టు, త్వరలో అందరికి అందించనున్నట్టు ప్రకటించారు. త్వరలో రెండో విడత కూడా ప్రారంభం కానుంది. రెండు రకాల్లో లభించనున్న ఈ-స్కూటర్లలో ఎస్1 మోడల్ ధర రూ.99,999, ఎస్1 ప్రొ మోడల్ ధర రూ.1,29,999గా నిర్ణయించారు.