బెంగళూరు,జూన్ 28:ప్రముఖ మల్టీనేషనల్ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా క్యాబ్స్ త్వరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రూ.2,400కోట్ల పెట్టుబడితో తమిళనాడులో ఓలా ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతున్నది. ఈ ఫ్యాక్టరీ పనులు పూర్తి కావస్తున్నాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
“ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ ఫ్యాక్టరీ తయారు కానుంది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ స్టేజ్1 పూర్తి కాబోతోంది. స్కూటర్లు త్వరలో రానున్నాయి అంటూ ట్వీట్ చేశారు.మరో ట్వీట్లో పెయింట్ ఆర్డర్ చేయాల్సిన సమయం వచ్చేసింది.ఎలాంటి రంగు కోరుతున్నారంటూ” ట్వీట్ చేశారు. ఓలా సంస్థ దేశంలోని 4వందల నగరాలు, పట్టణాల్లో లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నది. సింగిల్ చార్జ్తో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.