చెన్నై: దేశీయ రవాణా రంగంలో భవిష్యత్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు, కార్లు దూసుకెళ్లనున్నాయి. ఈ రేసులో క్యాబ్ సర్వీసెస్ అగ్రిగేటర్ ఓలా మరో అడుగు ముందుకేసింది. గురువారం నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ( Ola bookings )ప్రారంభించింది. కస్టమర్లు olaelectric.com వేదికగా ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకోవచ్చు.
ఈ-స్కూటర్ బుకింగ్ కోసం ఎంత చెల్లించాలో తెలుసా?! కేవలం రూ.499 చెల్లిస్తే సరి.. మీ పేరుపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ అయిపోతుంది. డెలివరీ టైంలో మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భావిష్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తమ ఈ-స్కూటర్ల బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పరిధిలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఫ్యాక్టరీని ఓలా ఎలక్ట్రిక్ స్థాపించింది.
దేశీయ మార్కెట్ డిమాండ్తోపాటు ఆసియా, యూరప్, సౌత్ అమెరికా మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఏటా 20 లక్షల స్కూటర్ల తయారీ సామర్థ్యం ఈ ప్లాంట్ లక్ష్యం. తొలి ఏడాదిలో 10 లక్షల స్కూటర్లు విక్రయించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఓలా ఎలక్ట్రిక్ రూ.2400 కోట్లు పెట్టుబడి పెట్టింది. హీరో సారధ్యంలోని ఏథెర్ ఎనర్జీ, బజాజ్ ఆటో చేతక్ వంటి సంస్థల ఈ-బైక్స్, ఈ- స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
హీరో ఏథెర్ బైక్ ధర రూ.1.39 లక్షలు, బజాజ్ చేతక్ స్కూటర్ ధర రూ. లక్ష పలుకుతున్నది. ఈ నెల రెండో తేదీన తమ స్కూటర్ ఫీచర్లను వీడియో ద్వారా భావిష్ అగర్వాల్ ఆవిష్కరించారు.
సమ్మిళిత ఆర్థిక వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్బీఐ గవర్నర్
పెట్రో షాక్ : వాహన విక్రయాలకు ఎదురుదెబ్బ
బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్గా భార్య.. అదే ఆఫీసులో భర్త స్వీపర్
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
సొంతింటి కోసం హైదరాబాదీల పరుగులు.. గణనీయంగా పెరిగిన కొనుగోళ్లు