న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఉద్యోగులకు షాకిచ్చింది. సాఫ్ట్వేర్ వర్టికల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 500 మందిని తొలిగించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
దీంతో ఇప్పటివరకు తొలగించిన వారి సంఖ్య వెయ్యికిపైగా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనేతేర సిబ్బందిపై ప్రత్యేక దృష్టిలో భాగంగా సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడింది. ప్రతిభ కలిగిన ఇంజినీర్ల సంఖ్యను 2 వేల నుంచి 5 వేల వరకు పెంచుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంస్థ.. అంతలోనే తొలగింపునకు మొగ్గుచూపింది.