అమరావతి : విజిలెన్స్ అధికారుల వేధింపులకు ఓ నూనె మిల్లు యజమాని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప జిల్లాలో సంచలనం కలిగించింది. కడప పట్టణంలో రామకృష్ణారెడ్డి అనే వ్యాపారి గత కొన్ని సంవత్సరాలుగా నూనెమిల్లు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తూ వేధింపులకు గురిచేస్తుండడంతో ఇవాళ కడప సమీపంలోని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను విజిలెన్స్ అధికారులు నిత్యం వేధిస్తుండడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృత దేహం వద్ద లభించిన సుసైడ్నోట్లో పేర్కొన్నాడు .
రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కడప ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు కారకులైన విజిలెన్స్ అధికారులపై కేసు నమోదు చేసేంతవరకు పోస్టుమార్టంను అడ్డుకుంటామని ఆయిల్ మిల్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.