సవరించిన టైం టేబుల్ విడుదల
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఐసీఎస్ఈ (10వ తరగతి), ఐఎస్సీ(12వ తరగతి) మొదటి సెమిస్టర్ పరీక్షలను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నట్టు సీఐఎస్సీఈ శనివారం ప్రకటించింది. కంప్యూటర్ల కొరత, కరెంటు సరఫరాలో అనిశ్చితి, ఇంటర్నెట్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. తాము చదువుతున్న బడుల్లోనే విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై సవరించిన టైమ్ టేబుల్ను కూడా సీఐఎస్సీఈ శనివారం విడుదల చేసింది. 12వ తరగతి పరీక్షలు నవంబర్ 22 నుంచి ప్రారంభమై, డిసెంబర్ 20తో ముగుస్తాయి. 10వ తరగతి పరీక్షలు నవంబర్ 29తో ప్రారంభమై డిసెంబర్ 16తో ముగుస్తాయి. పరీక్షల తేదీలను మార్చుతామని సీఐఎస్సీఈ గతంలోనే ప్రకటించింది. తొలుత ఈ పరీక్షలను నవంబర్ 15, 16వ తేదీల్లో ప్రారంభించాలనుకొన్నారు.