Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శుక్రవారం సాయంత్రం దేవస్థానం ఈవో లవన్న దంపతులు పట్టు పస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల సందర్బంగా పది రోజులు జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఈవో దంపతులు స్వయంగా పట్టువస్త్రాలు, ఫలపుష్పాదులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
ఈవో లవన్న దంపతులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధాన ద్వారం వద్ద ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యతోపాటు ప్రధాన అర్చకులు వీరయ్యస్వామి, మార్కండేయశర్మ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లవన్న దంపతులు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అనాదిగా వస్తున్న ఆచారానికి అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పించామని ఈఓ లవన్న అన్నారు.