Dalhousie | డల్హౌసీ (1848- 1856).. భారతదేశ ఆక్రమణకు ‘రాజ్య సంక్రమణం’ అనే శాంతియుతమైన ఎత్తుగడను అమలుచేసిన గవర్నర్ జనరల్. నిస్సంతువులైన పాలకుల దత్తపుత్రులను రాజులుగా చేసేందుకు నిరాకరిస్తూ.. 1848- 54 మధ్యకాలంలో సతారా, నాగ్పూర్, ఝాన్సీ తదితర చిన్నచిన్న రాజ్యాలను కబళించాడు. దీంతో డల్హౌసీ వెళ్లిపోయిన ఒక్క ఏడాదిలోపే.. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయీల తిరుగుబాటుకు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
కాగా, మొగల్ సామ్రాజ్యంలో మిగిలిన అవశేష రాజ్యం అవధ్ను ఆక్రమించుకునేందుకు డల్హౌసీకి రాజ్య సంక్రమణం పనిచేయలేదు. దాంతో అవధ్ నవాబు వాజిద్ అలీ షా పరిపాలన సవ్యంగా లేదని సాకుగా చూపించాడు. ఆయనకు ఎంతోమంది కొడుకులు ఉన్నప్పటికీ 1856లో సారవంతమైన గంగా మైదానంలో ఉన్న అవధ్పైన దురాక్రమణ జరిపాడు. ఇక్కడితో దాదాపు భారత ఉపఖండమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్రిటిష్ సామ్రాజ్యం ఛత్రఛాయ కిందికి వచ్చింది.