ఇండియన్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన విషయం తెలిసిందే. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమాషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక అందుకు తగినట్టుగానే ముందు నుంచిజక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నం రాజమౌళి చేయించగా, ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల చేసిన పోస్టర్స్, వీడియోస్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ట్రైలర్ విడుదల మరో మూడు రోజులలో ఉంటుందని తెలియజేస్తూ ఎన్టీఆర్ సోలో పిక్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో, ఒంటి నిండా రక్తపు మరకలతో స్టన్నింగ్ లుక్లో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ పిక్ అభిమానులకి ఆనందం అందించడమే కాక సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది. కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన వాయిదా పడంది.