న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే సీయూఈటీ పీజీ (CUET PG) అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు cuet.nta.nic.in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తరఫున ఎన్టీఏ నిర్వహిస్తున్నది. సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు రెండు సెషన్లలో జరుగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. కాగా, ప్రస్తుతం సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో పరీక్షలు ఉన్న అభ్యర్థుల హాల్ టికెట్లు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. మిగినవారివి త్వరలోనే విడుదల చేయనుంది.