న్యూఢిల్లీ, నవంబర్ 30: సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)నిర్వహణ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. అదేవిధంగా పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్ఈటీ స్కోర్ను కూడా ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణపై నియమించిన కమిటీ సిఫార్సులపై యూజీసీ ఈ మేరకు అన్ని యూనివర్సిటీల వైస్ఛాన్స్లర్లకు లేఖ రాసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలన్న యూనివర్సిటీల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, జేఈఈ, నీట్ పరీక్షలను 13 భాషల్లో నిర్వహిస్తున్న అనుభవం ఎన్టీఏకు ఇప్పటికే ఉందని యూజీసీ పేర్కొన్నది.