హుజూరాబాద్ రూరల్ : హూజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ర్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా కో-ఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు తో పాటు 150 మంది ఆయన అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. హూజూరాబాద్ మండలంసింగాపూర్ గెస్ట్హౌజ్ లో వారు ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
పర్లపల్లి నాగరాజుకు హరీశ్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా పనిచేసే నాయకులకు కనీస విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఈటల రాజేందర్ కుమ్మక్కు రాజకీయాల వల్లనే పార్టీని వీడనన్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న దళిత బంద్, సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాచనపల్లి ఎంపీటీసీ పొల్సాని రాజేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ కనవేన రాజమల్లు, గ్రామ శాఖ అధ్య క్షుడు బోళావేన ఎర్రయ్య, బొజ్జం తిరుపతి రెడ్డి, ముస్కె సదయ్య ,పొల్సాని లింగరావు, పింగళి సతీష్ రెడ్డి, మర్రిపెళ్లి రాజయ్య, ఎజ్జ తిరుపతి, ఇరవేన రమేష్, ఇరవేన మహేష్, కనవేన నాగరాజు, వీర్ల సతీష్, కోడారి సతీష్ పాల్గొన్నారు.