లండన్ : ఎన్నారై బీ(టీ)ఆర్ఎస్ యూకే కార్యవర్గం లండన్లో సమావేశమై పలు విషయాలపై చర్చించి, కొన్ని తీర్మానాలు చేసింది. ఎన్నారై బీ(టీ)ఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంతో పాటు కార్యవర్గ సభ్యులంతా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్గా అనిల్ కుర్మాచలంకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు యూకే కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉంటూ ఎన్నారై టీఆర్ఎస్ వేదికను లండన్లో మొట్ట మొదటగా స్థాపించి నేడు ఎఫ్డీసీ చైర్మన్గా ఎదిగిన అనిల్ కూర్మాచలం కృషిని ప్రతీ ఒక్కరు అభినందించి ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఆశీస్సులతో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ పదవి ఎన్నారై సమాజం మొత్తనానికి కేసీఆర్ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామని అశోక్ గౌడ్ తెలిపారు.
అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గ దశాబ్ద కాల సహకారానికి, ప్రోత్సాహానికి భాగోద్వేగాపూరిత కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, నాకింతటి గౌరవాన్ని, ఆదరణను ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రయాణంలో సహకరించి, ప్రోత్సహించిన బీ(టీ)ఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రవాస మిత్రులకు, సంస్థలకు కృతఙ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సైతం ఇదే నిజాయితీ, నిబద్ధతతో ఎన్నారై బీ(టీ)ఆర్ఎస్ యూకే పని చేయాలని, దశాబ్ద కాలంగా ఎందరికో ఆదర్శంగా నిలిచామని, అదే స్పూర్తితో కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీకి కూడా సేవలందించి, వారి వెంటే నడవాలని అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, జాతీయ పార్టీని ఎన్నారై బీ(టీ)ఆర్ఎస్ యూకే స్వాగతిస్తుందని, రాబోయే రోజుల్లో కేసీఆర్ దిశా నిర్దేశం ప్రకారం నూతన జాతీయ పార్టీకి సేవలందింస్తామని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తెలిపారు.
దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని నేడు ప్రతీ రాష్ట్రం తెలంగాణ మోడల్ ని కోరుకుంటుందని, కేసీఆర్ నాయకత్వం వల్లే అది సాధ్యమని నమ్ముతున్నారని దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందని ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికల్లో బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం ఎన్నారై బీ(టీ)ఆర్ఎస్ యూకే ప్రత్యేక కార్యాచరణతో వస్తుందని లండన్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి తెలిపారు. అటు క్షేత్ర స్థాయిలోని నాయకులతో, కార్యకర్తలతో, సోషల్ మీడియా వారియర్స్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని తెలిపారు.
ఇలా పలు తీర్మానాలకు కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలిపింది. చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారి లండన్ విచ్చేసిన అనిల్ కూర్మాచలంను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ సమావేశంలో అధ్యక్షుడు అశోక్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ప్రవీణ్ వీర, ఇతర సభ్యులు నవీన్ భువనగిరి, హరి గౌడ్ నవాపేట్, రవి ప్రదీప్ పులుసు, సత్య మూర్తి చిలుముల, , సృజన రెడ్డి చాడ, మల్లా రెడ్డి బీరం, రవి రేతినేని, సతీష్ రెడ్డి బండ, సేరు సంజయ్, రమేష్ ఎసెంపల్లి, సురేష్ గోపతి, నవీన్ మాది రెడ్డి, సత్యపాల్ పింగిళి, ప్రశాంత్ కటికనేని, సురేష్ బుడగం, రాజేష్ వర్మ, రామకృష్ణ రావు కలకుంట్ల, మధు యాదవ్, గణేష్ కుప్పాల తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.