న్యూఢిల్లీ: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈనెల 28లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 225 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో కాళీలు ఉన్నాయి. ఎలాంటి రాపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 225
ఇందులో మెకానికల్ 87, కెమికల్ 49, ఎలక్ట్రికల్ 31, ఎలక్ట్రానిక్స్ 13, ఇన్స్ట్రుమెంటేషన్ 12, సివిల్ 33 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. గేట్ 2020, 21, 22లో అర్హత సాధించి, 26 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 28
వెబ్సైట్: www.npcilcareers.co.in