హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని మంత్రి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక కేసీఆర్ పదవులను తృణప్రాయంగా వదిలేసి పోరుబాట పట్టిన యోధుడని మంత్రి కొప్పులఈశ్వర్ కొనియాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ను స్థాపించి సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి మహోద్యమాన్ని నడిపిన మహానేత కేసీఆర్ అని కొప్పుల కొనియాడారు.
తాను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన రోజు చారిత్రాత్మకమైందన్నారు. కేసీఆర్ తాను సాధించిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీక్షా దివస్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.