Rashmika Mandanna and Disha patani | తెలుగులో బాలీవుడ్ తారలు చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాం. కియారా అద్వానీ, సయీ మంజ్రేకర్, దీపకా పదుకొనే, ఆలియా భట్ లాంటి హిందీ నాయికలంతా తెలుగు స్టార్స్ తో ఆడిపాడుతున్నారు. పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా చేరడం ఈ నాయికల రాకకు కారణంగా చెప్పుకోవచ్చు. మన స్టార్స్ క్రేజ్ ఏ బాలీవుడ్ హీరోకు తీసిపోనంతగా పెరిగిపోయింది. ప్రభాస్, రామ్ చరణ్ , అల్లు అర్జున్, మహేశ్ బాబు నుంచి విజయ్ దేవరకొండ దాకా…టాలీవుడ్ హీరోలు బాక్సాఫీస్ ఐకాన్గా మారిపోయారు. దీంతో బాలీవుడ్ నటీమణులు మన హీరోలతో చేసేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మరో బాలీవుడ్ నాయిక దిశా పటానీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవ్వగా.. ఆమె అవకాశానికి రష్మిక మంధన గండికొట్టింది.
లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీ..ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి భాఘీ, ఎంఎస్ ధోని, రాధే వంటి చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. మరోసారి ఆమె తెలుగు తెరను పలకరిస్తుందని ఇటీవల చెప్పుకున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించబోతున్న కొత్త సినిమాలో దిశా పటానిని నాయికగా ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ స్థానంలోకి ఇప్పుడు రష్మికను తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిశా పటానీ బాలీవుడ్ లో పేరున్న హీరోయిన్నే. కానీ రష్మిక బాలీవుడ్లో తాజా సంచలనం. పుష్ప సినిమా అక్కడ వంద కోట్లు వసూలు చేయడంతో హీరో అల్లు అర్జున్తో పాటు హీరోయిన్ రష్మికకు కూడా మంచి పేరొచ్చింది. శ్రీవల్లిగా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో కావాల్సిన నాయిక ఇక్కడే ఉండగా.. బాలీవుడ్కు ఎందుకు వెళ్లడం అని భావించిన నిర్మాతలు చరణ్కు జోడీగా రష్మికను కన్ఫార్మ్ చేశారని సమాచారం. మళ్లీ రావా, జెర్సీ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
“Keerthy Suresh | రష్మిక బాటలో కీర్తిసురేశ్..ఆ క్రేజీ అప్ డేట్ ఏంటంటే..?”
“Rashmika Mandanna | కుర్రకారు మతులు పోగొడుతోన్న అందాల రష్మిక..”
Rashmika mandanna | తెలుగు సినిమాలు రిజెక్ట్ చేస్తున్న రష్మిక మందన్న..”
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..”