మణిరత్నం దర్శకత్వంలో రూపొందిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’ ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. చోళ రాజుల్లో ప్రసిద్ధుడైన పదో శతా బ్దం నాటి రాజరాజ చోళ -1 ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో అగ్ర తార ఐశ్వర్యరాయ్ తల్లీకూతుళ్లుగా ద్విపాత్రాభినయంలో కనిపించనుంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాల సందర్భం గా పాత్రికేయులతో ముచ్చటించిన దర్శకుడు మణిరత్నం..ఐశ్వర్యరాయ్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 1994లో ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చిందని, ఐశ్వర్యరాయ్ పాత్ర కో సం అప్పట్లో రేఖను ఎంపిక చేయాలనుకున్నానని చెప్పారు. తొలుత కమల్హాసన్తో ఈ సినిమా ప్లాన్ చేశానని, అనివార్య కారణాల వల్ల ఆ ప్రయ త్నం ఫలించలేదన్నారు. ఇరవై ఏళ్లుగా ఈ కథతో తాను ప్ర యాణం సాగించానని మణిరత్నం తెలిపారు. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్న డ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది.