బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షానికి వరదలు పోటెత్తడంతో.. బెంగళూరు నగరమంతా జలమయం అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ఏరియాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
అయితే ఓ వ్యక్తి తన భవనంలోకి వరద నీరు వచ్చిన దృశ్యాలను చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది నది కాదు.. నా భవనం బేస్మెంట్ అని పేర్కొన్నారు. ఆ భవనం సెల్లార్లో నదిలా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 37 వేల మంది వీక్షించారు.
ఇక ఈ ట్వీట్పై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఈ భవనాన్ని చెరువుపైనే నిర్మించి ఉండొచ్చని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. చెరువులో భవనం కడితే.. నీళ్లు రాకపోతే ఏం వస్తాయని మరొకరు ప్రశ్నించారు. ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ, ప్రకృతి విపత్తు ముందు ఇవన్నీ సహజమే అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
This is’nt a river,its my building’s basement.#bbmp #bengalururains pic.twitter.com/NFU2wmr5o8
— Jeeshan Kohli (@JeeshanKohli) October 20, 2022