హైదరాబాద్ : నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) నూతన పాలకవర్గం గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసింది. డెయిరీ చైర్మన్గా ఎన్నికైన గంగుల కృష్ణారెడ్డితో పాటు డైరెక్టర్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో కలువగా.. కార్యవర్గాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నార్ముల్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, కొత్త డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలందర్ రెడ్డి, రచ్చా లక్ష్మీ నరసింహారెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.