యాంగోన్ : మయన్మార్లో తిరుగుబాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. తమకు స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేంత వరకు తమ సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతుందని ప్రజలు ప్రతినబూనారు. విద్యుత్ బిల్లు, వ్యవసాయ అప్పు చెల్లించడం నిలిపివేశారు. మరికొన్ని బిల్లులు చెల్లించకుండా తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్లు ప్రజలు చెప్తున్నారు. మయన్మార్ సైనిక పాలనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. దేశంలో తిరుగుబాటు చేసినప్పటి నుంచి సుప్రీం జనరల్కు వ్యతిరేకంగా స్వాతంత్ర్య స్వరం వినిపిస్తూ.. పిల్లలను బడికి పంపవద్దని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం మయన్మార్లోని పెద్ద నగరాల్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసాయి. ఇండోనేషియాలోని ఆసియాన్ దేశాల సమావేశంలో మయన్మార్ సీనియర్ జనరల్ మింగ్ ఆంగ్ హైయింగ్ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. కానీ తొలగించిన ప్రజాస్వామ్య ప్రభుత్వ నాయకురాలు ఆంగ్ సాన్ సుకీతో పాటు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్ను జుంటా చీఫ్ పట్టించుకోలేదు. మీడియా స్వేచ్ఛను కొల్లగొట్టడంతో పాటు జుంటా చాలా మంది జర్నలిస్టులను జైళ్లో పెట్టింది. దీనికి నిరసనగా మయన్మార్ ప్రజలు నిరాహార దీక్షలు ప్రారంభించి.. సహాయ నిరాకరణ ఉద్యమం వరకు తీసుకెళ్లారు. ఈ ఉద్యమం వల్ల మయన్మార్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
కరోనా రియల్ డాటా ఇవ్వలేరా?: రాహుల్ గాంధీ
వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహరణ..!
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
అమెరికా నుంచి ఢిల్లీకి చేరిన 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
భారత్కు ఆక్సిజన్, వెంటిలేటర్, పీపీఈ కిట్లు పంపనున్న ఆస్ట్రేలియా
కరోనా సెకండ్ వేవ్ మీ వల్లే వచ్చింది.. ఈసీకి మద్రాస్ హైకోర్టు మందలింపు
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్లోని ఓ ఊరి కథ
సౌదీ నుంచి భారత్కు 80 టన్నుల ఆక్సిజన్
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..