ముంబై ,జూలై :ఎంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ అయినా కింద పడితే పగిలిపోద్దేమోననే భయం ఇక నుంచి ఉండదు. నోకియా బండకేసి బాదినా చెక్కుచెదరని సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. స్క్రీన్ గార్డులు, పౌచ్లు వంటివి వాడుతూ ఫోన్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఉపయోగించినా పగిలి పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు నొకియా “ఎక్స్ఆర్ 20” పేరుతోమార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టనున్నది.
తాజాగా ఈ ఫోన్కు సంబంధించిన వీడియోను నోకియా మొబైల్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ వీడియోలో ఫోన్ సామర్థ్యాన్ని పలు విధాలుగా టెస్ట్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో తీసుకురానున్న ఈ ఫోన్ 1.8 మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డా, నీటిలో మునిగినా, మట్టిలో పడిపోయినా ఫోన్ ఏమాత్రం చెక్కుచెదరదు. నోకియా ఈ ఫోన్ను సెప్టెంబర్ లో ఇండియాలో లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నోకియా సరికొత్త ఫీచర్స్ “ఎక్స్ఆర్ 20″…
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 40,900గా ఉండనున్నది. ఆండ్రాయిడ్ 11 వెర్షన్తో నడిచే ఫోన్ను ఆండ్రాయిడ్ 12, 13, 14 వెర్షన్స్కు అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 4630ఎంఏహెచ్ బ్యాటరీ అందించిన ఈ ఫోన్ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్తో పని చేస్తుంది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+డిస్ప్లేతో పాటు 90 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ అందించారు. 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో పాటు 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.