ప్రజలంగీకరిస్తేనే రాష్ట్రంలో ప్లాంట్
ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ సెమినార్లో ఏఎండీ డైరెక్టర్ సిన్హా
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వల కోసం వెతుకులాటను తాత్కాలికంగా నిలిపివేశామని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రిసెర్చ్ (ఏఎండీ) డైరెక్టర్ డీకే సిన్హా పేర్కొన్నారు. ప్రజలు అంగీకరిస్తేనే ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నది తమ ప్రాథమిక నిబంధన అని చె ప్పారు. తెలంగాణలో ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఇం డియన్ న్యూక్లియర్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సోమవారం ‘రేడియేషన్, పర్యావరణంపై ప్రభావం’ అనే అంశంపై ఏఎండీలో సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా డీకే సిన్హా మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో తాము కేవ లం నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టామని, ఎలాంటి భారీ తవ్వకాలు చేపట్టలేదని చెప్పారు. నల్లమలలో భారీస్థాయిలో యు రేనియం నిక్షేపాలు ఉన్నాయన్నారు.
భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రజలు, ప్రభుత్వం కలిసి తమకు ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి సమ్మతిస్తే మళ్లీ ప్రయత్నాలు ప్రా రంభిస్తామని తెలిపారు. సాధారణంగా భూమికి సుమారు ఒక కిలోమీటర్ వరకు లోతులో అణుధార్మిక పదార్థాలు నిల్వ ఉంటాయని, కొన్ని చోట్ల భూమి పైపొరల్లోనూ కొంత మొత్తంలో నిక్షేపాలు ఉం డొచ్చని చెప్పారు. నీళ్ల కోసం బోర్లు లేదా మైనింగ్ జరిపినప్పుడు ఉపరితలానికి వస్తాయని లేదా సమీప జలవనరుల్లో కలుస్తాయని చెప్పారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రేడియేషన్ ప్రభావం కనిపిస్తుందన్నారు. యురేనియం వంటి అణుధార్మిక పదార్థాలను భూమి నుంచి వెలికితీయడం, వినియోగించడం వల్ల పర్యావరణానికి కలిగే హాని నామమాత్రమేనని చెప్పారు.
అపోహల కారణంగా అణుధార్మిక పదార్థాల వెలికితీతను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అణు పదార్థాల వల్ల రోగాలు వస్తాయనడం సరికాదని, వాటిని సరైన పద్ధతిలో వినియోగిస్తే హాని కలుగదని చెప్పారు. అణుధార్మికతపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ప్లాంట్లలో పనిచేస్తు న్న సిబ్బందే ఇందుకు నిదర్శనమని చెప్పా రు. వైద్యరంగంలో క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల చికిత్సలో అణుధార్మికతను వినియోగిస్తారని చెప్పారు. ఏపీలోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం ప్లాంట్ను విస్తరించనున్నట్టు సిన్హా తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్సీ సీఈవో దినేశ్ శ్రీవాత్సవ, రిటైర్డ్ డిప్యూటీ సీఈవో హేమంత్రావు, యూసీఐఎల్ జనరల్ మేనేజర్ ఎంఎస్రావు తదితరులు పాల్గొన్నారు.