కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం నందిగ్రామ్లో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ గాయపడిన విషయం తెలుసు కదా. తనను ఎవరో కావాలనే తోసేశారని, ఇది బీజేపీ కుట్ర అని ఆమె ఆరోపించారు. ఈ ఘటనతో ఆమె ఎడమ కాలు విరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం మాత్రం మరోలా ఉంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో వాళ్లు మాట్లాడుతూ.. మమతను ఎవరూ తోయలేదని, ఆమెను చూడటానికి భారీగా జనం వచ్చారని సౌమెన్ మైతీ అనే విద్యార్థి చెప్పాడు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని కూడా అతడు చెప్పాడు.
మరో ప్రత్యక్ష సాక్షి చిత్తరంజన్ దాస్ అనే వ్యక్తి కూడా ఇదే మాట చెప్పడం గమనార్హం. కారు వెళ్తున్న సమయంలో ఆమె సీట్లో కూర్చున్నారు. అయితే డోర్ మాత్రం తెరిచే ఉంది. ఆ తర్వాత ఆ డోర్ పోస్టర్కు తగలడంతో అది మూసుకుపోయింది. అంతే తప్ప మమతను ఎవరూ తోయలేదు, ఆమెపై చేయి చేసుకోలేదు అని చిత్తరంజన్ దాస్ స్పష్టం చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని చెప్పాడు.