న్యూఢిల్లీ: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు..అలాంటివి ఏర్పాటు చేసే ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశం లేదని పార్లమెంట్లో కేంద్రం తేల్చి చెప్పింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఉన్నందున పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానని బీజేపీ ఎంపీ అరవింద్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు తేలేకపోతే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు.