ఏలూరు జిల్లా : అమరావతి రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. రైతుల పాదయాత్ర గత 15 రోజులుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పాదయాత్ర జరుగుతున్నది.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఒక్కరోజు విరామం ప్రకటించారు. రేపు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 15 రోజులుగా అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతున్నది. 16 వ రోజు కొత్తూరు నుంచి బయల్దేరి ఏలూరు, పాలెగూడె, కొప్పలి వరకు పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తున్నది. ప్రధానంగా మహిళలు, యువత, టీడీపీ కార్యకర్తలు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి మద్ధతుగా నిలుస్తున్నారు. పాదయాత్ర ఈ నెల 12 న అమరావతి నుంచి ప్రారంభమైంది. 60 రోజుల అనంతరం అరసవిల్లిలో ముగియనున్నది.