చెన్నై : కరోనా మహమ్మారితో కేరళ అల్లాడుతోంది. మరో వైపు నిపా వైరస్తో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించారు. దీంతో పొరుగున ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరులో నిపా తొలికేసు గుర్తించారని, కోయంబత్తూరు జిల్లా అధికారి సమీరన్ పేరిట వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి కేసును గుర్తించలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా సమీరన్ మాట్లాడుతూ కేరళలోని కాలికట్లో నిపా వైరస్ కేసును గుర్తించారని, సరిహద్దులో ఉన్న కోయంబత్తూరులో సోకకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిపా వైరస్ సంక్రమణ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపింది.