హుజూరాబాద్: మీరు బీజేపీ పార్టీనా..? అయితే మా ఇంటికి రాకండి.. మేం మీకు ఓటెయ్యం..!! అంటున్నాడు హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లికి చెందిన కందకట్ల మురళి. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1020, పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 107కు పెంచి తనలాంటి సామాన్యుడి నడ్డివిరుస్తున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నాడు. బీజేపీ నాయకులు ఓటు అడిగేందుకు తన ఇంటికి రావొద్దంటూ ఫ్లెక్సీకూడా ఏర్పాటు చేశాడు. అన్నదాతలతోపాటు అన్నివర్గాలనూ ఆదరిస్తున్న టీఆర్ఎస్వైపే ఉంటానని స్పష్టంచేస్తున్నాడు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్, రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత కరెంటు, గొల్ల, కుర్మలకు గొర్రెపిల్లలు, మత్స్యకారుల కోసం చెరువుల్లో ఉచిత చేపపిల్లలు.. ఇలా తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ వెంటే నడుస్తానని తెగేసి చెబుతున్నాడు. కాగా, స్థానికంగా ఈ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటున్నది. సోషల్మీడియాలోనూ వైరల్ అవుతున్నది..