మహబూబ్నగర్: మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో మరో మూడు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాథాలజీలో మూడు పీజీ మెడికల్ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు చేసింది. దీనివల్ల మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరింత అవకాశం ఏర్పడనుందని కాలేజీ డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ అన్నారు. ఈ పెంపుతో ఏడు మెడికల్ స్పెషాలిటీల్లో పీజీ సీట్ల సంఖ్య 20కి పెరిగాయని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.