నిజామాబాద్ క్రైం,అక్టోబర్14 : వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తాడని భావించిన కొడుకే వారి పాలిట కాలయముడయ్యాడు. దత్త పుత్రుడే నగల కోసం పెంచిన తల్లిదండ్రులను పాత నేరస్తుడితో కలిసి కడతేర్చాడు. ఆలూర్ మండలంలో ఈ నెల 11వ తేదీన వెలుగు చూసిన దంపతుల అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆర్మూర్ పరిధిలోని ఆలూర్ గ్రామం లో కమ్మరి పడిగెల గంగారాం-గంగమణి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఈ సంఘటనపై మృతురాలి చెల్లెలు పల్లె అనురాధ ఫిర్యా దు మేరకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు పర్యవేక్షణలో సీఐ బి.సురేశ్ బాబు ఆధ్వర్యంలో తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. దీంతో శుక్రవారం పాత నేరస్తుడైన ఆలూర్ గ్రామానికి చెందిన అన్రాసి వెంకటిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా దంపతులను హత్య చేసినట్లు అంగీకరించాడు.
హత్యకు గురైన దంపతుల పెంపుడు కుమారుడు అయిన మైనర్ స హకారం ఉందని వెంకటి పోలీసుల విచారణలో తెలిపాడు. దంపతుల వద్ద ఉన్న బం గారు నగలు, ఇతర సొత్తు దోచుకునేందుకు చీరను వారి మెడకు బిగించి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. దోచుకున్న బంగారు నగ లు, వెండి పట్ట గొలుసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వెంకటిని రిమాండ్కు తరలించగా దంపతుల పెంపుడు కుమారుడు(మైనర్)ను జువెనైల్ హోమ్కు తరలించినట్లు సీపీ నాగరాజు వెల్లడించారు.
లైంగిక దాడి, మర్డర్ కేసులో జీవిత ఖైదు..
వెంకటికి 2008వ సంవత్సరంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లైంగిక దాడి, మర్డర్ కేసుతో పాటు దొంగతనం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 12 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి 2020 సంవత్సరం అక్టోబర్లో సత్ప్రవర్తనతో జైలు నుంచి వి డుదలైనట్లు సీపీ తెలిపారు. బయటికి వచ్చిన తర్వాత డబ్బుల కోసం బాలుడికి మాయమాటలు చెప్పి పెం పుడు తల్లిదండ్రులను హత్య చేసినట్లు తెలిపారు. కేసు ను ఛేదించిన ఏసీపీ ప్రభాకర్ రావు, సీఐ సురేశ్ బాబు, ఎస్సై ప్రదీప్తో పాటు సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.