బోధన్/బోధన్ రూరల్, సెప్టెంబర్ 22 : ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రీరాజేశ్వర్, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మీగంగారెడ్డి అన్నారు. నూతనంగా పింఛన్లు మంజూరైన 225 మంది లబ్ధిదారులకు మండలంలోని సాలూరా గ్రామ రైతు వేదికలో గురువారం పింఛన్ మంజూరుపత్రాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కలుగుతున్నదన్నారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలువాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, సింగిల్విండో చైర్మన్ అల్లె జనార్దన్, ఎంపీటీసీ కండెల సవితాసంజీవ్, ఐడీసీఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి సిర్ప సుదరర్శన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయారెడ్డి, కేజీ గంగారాం, బుయ్యన్ సురేశ్ పటేల్, మౌలానాతోపాటు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.