అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి తెలంగాణను ప్రగతిబాటలో పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్తోనే దేశం అన్నివిధాలా బాగుపడుతుంది. సమస్య ఏదైనా.. పరిష్కరించగల నేర్పు, ఎదిరించి పోరాడే నాయకుడు కేసీఆర్తో సాధ్యమవుతుంది. ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని వివిధ రంగాల్లో అగ్రగ్రామిగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు. అద్భుతమైన పరిపాలనా విధానంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యమ అనుభవం, చురుకుగా వ్యవహరించే స్వభావం, కొత్త ఆలోచనలు కలిగిన డైనమిక్ లీడర్ కేసీఆర్. ఆయన నాయకత్వంలో ఏర్పడే జాతీయ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. సీఎంగా ప్రతి ఇంటికీ ప్రజా సంక్షేమ పథకాలు చేరవేశారు. కవులు,రచయితలు, కళాకారులకు సముచిత స్థానం కల్పించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే.. దేశం ప్రగతి సాధిస్తుంది. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరుబాట పట్టిన ఉద్యమ నేతకు రచనలు, కవితల ద్వారా వెన్నంటే ఉన్నాం. నేడు దేశ సంక్షేమం కోసం బయల్దేరుతున్న కేసీఆర్కు అండగా ఉంటం.. అని కవులు, రచయితలు, కళాకారులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
ఇందూరు/విద్యానగర్,సెప్టెంబర్ 21 :ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాడు. దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. దేశం అభివృద్ధి చెందాలన్నా.. బంగారు భారతం కావాలన్నా కేవలం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. దేశంలోని ఇతర రాష్ర్టాలూ తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందుతాయి. బీజేపీ పాలనలో సంక్షేమ పథకాలు పేదలకు అందని ద్రాక్షలాగా మిగిలాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా జాతీయ రాజకీయాల్లో సమర్ధవంతమైన నాయకుడు లేక పేద దేశంగానే మిగిలిపోతుంది. ఇలాంటి సమయంలో సమర్థవంతమైన నాయకుడు రావాలంటే కేసీఆర్ వంటి ఉద్యమ నాయకుడితోనే సాధ్యమవుతుంది. సీఎంగా తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో పల్లె, పట్టణ రూపురేఖలు మారాయి. కేంద్ర ప్రభుత్వం పేదలను దోచి ఉన్నోడికి పెడుతూ పేదల నడ్డి విరుస్తుంది. సీఎం కేసీఆర్ మాత్రం.. రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, కులవృత్తులను సంరక్షిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని రైతులు,యువకులు, ఉద్యోగులు, కుల వృత్తులకు ఎంతో మేలు చేస్తారు. ఇలాంటి గట్స్ ఉన్న నాయకుడు దేశానికి ఎంతో అవసరం.
తెలంగాణలో ఆదర్శవంత పాలన
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని తగిన విధంగా పరిపాలిస్తూ దేశమంతటికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అందరికీ అండగా ఉంటున్నారు. కేసీఆర్ వంటి నాయకుడు దేశ రాజకీయాలో చేరి, ప్రధాని అయితే రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ర్టాలు అభివృద్ధి చెందితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో చాలా మార్పులు వచ్చాయి. దేశంలో కూడా అనేక మార్పులు వస్తా యి. ప్రజలందరికీ మేలు జరుగుతుంది.
-కాసర్ల రాంచంద్రం, కవి
సంక్షేమ పథకాలు అమలు కావాలి..
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఎంతో అవసరం. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణతోపాటు దేశం కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. రైతుబంధు, రైతుబీమా పథకాలను దేశ వ్యాప్తంగా అమలుపరిస్తే రైతులంతా ఆనందంగా ఉంటారు. కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం. బంగారు తెలంగాణ మాదిరి బంగారు భారత్గా మారాలంటే కేసీఆర్ వంటి సమర్ధమైన ఉద్యమ నాయకుడు రావాలి.
-సుధాకర్, ప్రజాకవి
ఒరవడి తెచ్చిన మహానేత కేసీఆర్…
రాజకీయాలకు నూతన ఒరవడిని తెచ్చిన మహానేత కేసీఆర్. పేద ప్రజల అభ్యున్నతికి బ్రహ్మాస్త్రంగా తీర్చిదిద్దిన షాదీముబారక్, ఆసరా పింఛన్, రైతుబంధు, రైతుబీమా,డబుల్ బెడ్రూం ఇండ్లు, హరితహారం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ వంటి వినూత్న పథకాల రూపశిల్పి సీఎం కేసీఆర్. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి జనహృదయాల్లో స్ఫూర్తి నింపిన మహా నాయకుడు కేసీఆర్. అలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం గర్వించదగ్గ తెలంగాణ బిడ్డగా కేసీఆర్ నిలుస్తారు.
-విజయశ్రీ, రచయిత్రి
కేసీఆర్ దేశానికి ఎంతో అవసరం..
రాష్ర్టాన్ని విజయపథంలో నడిపిన సీఎం కేసీఆర్ దేశానికి ఎంతో అవసరం. ప్రస్తుత తరుణంలో సీఎం దేశ రాజకీయాలపై దృష్టి సారించడం హర్షణీయం. పట్టుదలతో అభివృద్ధి చేసే వ్యక్తి దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తారు. దేశంలో ఉన్న వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకవచ్చి దేశ ప్రజల అభ్యున్నతికీ కేసీఆర్ కృషి చేస్తారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అద్భుతంగా రాణిస్తారు.
-చంద్రకాంత్ (కవి,రచయిత)
కేసీఆర్ వస్తే దేశం మరింత అభివృద్ధి..
కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్కు కొమ్ముకాస్తున్నది. మతపరమైన రాజకీయాలు చేస్తున్నది. దేశంలో ఉన్న నాయకులు కుల,మతాల పరంగా కాకుండా జాతీయ సమైక్యతను పాటించాలి. సంస్కృతీ సంప్రదాయాలు, రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్కు మాత్రమే అది సాధ్యం అవుతుంది.
-రవీందర్ (కవి,పాటల రచయిత)
తనదైన ముద్ర వేస్తారు
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశం అత్యవసరం. ప్రస్తుతమున్న దుర్మార్గపు రాజకీయాలను అరికట్టాలంటే.. సమర్థవంతంగా పాలన చేయాలంటే.. పోరాట వీరుడు, ధైర్యవంతుడైన కేసీఆర్ లాంటి కార్యదక్షుడు ఎంతో అవసరం. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి ఒక్క కేసీఆర్తోనే సాధ్యం.
-షేర్ల దయానంద్, రిటైర్డ్ అధ్యాపకుడు
దేశ భవిష్యత్తుకు భరోసా కేసీఆర్
దేశ భవిష్యత్తుకు కేసీఆర్ భరోసా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే దీక్షాదక్షుడు. మేక్ ఇన్ ఇండియాకు ఏకైక మార్గదర్శకుడు. రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలించి, సంక్షేమ పథకాలు సబ్బండవర్గాలకు అందించి..రైతును రాజు చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే సంక్షేమ పథకాలు దేశమంతా అమలవుతాయి. అప్పుడే దేశం ప్రగతి బాటలో దూసుకుపోతుంది.
-మల్లవరపు చిన్నయ్య, కవి, రచయిత
స్వర్ణయుగం వస్తది..
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే మళ్లీ స్వర్ణయుగం వస్తది. కష్టపడే వారికి పని దొరుకుతుంది. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో బతుకుతాడు. రైతు సంతోషంగా ఉంటాడు. చేను చెలక విరగబూస్తది. గుమ్మీలు వడ్లతో నిండుతాయి. చెరువులు చేపలతో కళకళలాడుతాయి. మనుషుల మనసులు తృప్తితో నిండుతాయి. పేద, బీద, పెద్ద, చిన్న తారతమ్యాలు లేని నవభారత నిర్మాణం జరుగుతుంది. కేసీఆర్ రూపంలో అశోకుడు మళ్లీ పుట్టినట్టే. కేసీఆర్తో దేశ రాజకీయాల్లో వెలుగు వెలగడం ఖాయం.
-నరాల సుధాకర్, కవి, రచయిత
కార్యదీక్షాపరుడు కేసీఆర్..
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దేశంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలి. ప్రపంచానికి ఆదర్శమైన అంకుర పరిశ్రమ హైదరాబాద్లో నెలకొల్పిన గొప్ప సీఎం కేసీఆర్. దేశంలోని మేధావులు, యువత కేసీఆర్ పాలన కోరుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా కాళేశ్వరం నిర్మించి తెలంగాణ రైతుల ముఖంలో చిరునవ్వులు పూయించిన భగీరథుడు, కార్యదీక్షపరుడు అయిన కేసీఆర్ దేశాన్ని పాలిస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు.
-పోత్నూరి లక్ష్మణ్ కవి, రచయిత
నాడు రాయల వారు.. నేడు కేసీఆర్ సారు
ఎక్కడో మూలాన ఉన్న సాహితీమూర్తులను గుర్తించి కాళోజీ, దాశరథి వంటి ప్రసిద్ధుల పేర్లతో పురస్కారాలు అందిస్తూ కవులను, వివిధ రంగ కళాకారులను సత్కరిస్తున్న మరో రాయలవారేనేమో మన సీఎం కేసీఆర్. కవులతోపాటు నట, నాట్య, జానపద కళారంగాల ప్రముఖులను, వారి సేవలను గుర్తించి మండల, జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సత్కరిస్తూ.. ఎవరూ పట్టించుకోని కళారంగానికి జీవం పోస్తున్న సీఎం కేసీఆర్ రానున్న కాలంలో ప్రధాని కావాల్సిందే. దేశంలో కళ తప్పుతున్న కళారంగాలకు జీవం పోయాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ప్రపంచ స్థాయిలో దేశ ఔనత్యాన్ని చాటి చెబుతారు.
-కవి, రచయిత విపి.చందన్రావు