బాన్సువాడ రూరల్, జూలై 21 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం అమలుకు రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని తెలిపారు. గురువారం తన సొంత గ్రామమైన పోచారంలో ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు.
శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను తక్షణమే తొలగించి, నూతన గదులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. స్పీకర్ వెంట డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, పోచారం, దేశాయిపేట్ గ్రామాల సర్పంచులు రాధ, శ్రావణ్కుమార్, బాన్సువాడ విండో చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సచిన్, రవి, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, బోనాల సుభాష్, సుధాకర్రెడ్డి, సాయిరెడ్డి, విజయ్గౌడ్. ఉపాధ్యాయులు సంతోష్కుమార్, కృష్ణారెడ్డి, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.