బోధన్ రూరల్, ఫిబ్రవరి 11: మండలంలోని సాలూరా గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.ఎనిమిది లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పనులను చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని దోన్పాల్ గ్రామంలో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.పది లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మంత్రి సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ కమిటీ సభ్యుడు సంజీవ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సర్పంచ్ దేవన్న, ఉపసర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముత్యాల లక్ష్మణ్, పర్స గంగన్న, లింగన్న తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని బాబానగర్, జాగిర్యాల్, కుప్కల్, సికింద్రాపూర్, ఎంజీ తండా గ్రామా ల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టే పనులను ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ బద్దం రవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిధులను మంజూరు చేయించిన మంత్రి ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ శర్మనాయక్, సర్పంచులు గుణ్వీర్రెడ్డి, మానస, అథిక్, రాములు, ఎంజీ నాయక్, ఎంపీటీసీ సభ్యులు సాయిప్రసన్న, సుమలత, గంగాధర్గౌడ్, ఉపసర్పంచులు, నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మండలం మీదుగా వెళ్లే 63వ నంబర్ జాతీయ రహదారి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు నుంచి కమ్మర్పల్లి మీదుగా జిల్లా సరిహద్దు వద్ద ఉన్న గండి హనుమాన్ వరకు రూ.ఐదు కోట్లతో చేపడుతున్న పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇటీవల ప్రారంభించారు. రోడ్డు పునరుద్ధరణ పనులు పూర్తయితే వాహనదారుల ఇబ్బందులు తీరనున్నాయి.