నిజాంసాగర్/ గాంధారి/ లింగంపేట/ సదాశివనగర్/ బాన్సువాడ/ బీర్కూర్/ కామారెడ్డిరూరల్/ మాచారెడ్డి/ నస్రుల్లాబాద్, అక్టోబర్ 28: జిల్లాలోని వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు గురువారం ప్రారంభించారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట సొసైటీ పరిధిలోని గోర్గల్లో, గున్కుల్ సొసైటీ పరిధిలోని మహ్మద్నగర్లో, మల్లూర్ సొసైటీ పరిధిలోని మల్లూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీమాజీ చైర్మన్ దఫేదార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మనోహర్, సొసైటీ చైర్మన్లు నర్సింహారెడ్డి, వాజిద్అలీ, కళ్యాణీవిఠల్రెడ్డి, తహసీల్దార్ నారాయణ, వ్యవసాయశాఖ అధికారి అమర్ప్రసాద్, ఎంపీడీవో పర్బన్న, ఎంపీవో అబ్బాగౌడ్, సర్పంచులు బాలమణి, అంబవ్వ, ఖాసీంసాబ్, కంసవ్వ, అంజయ్య, లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాంధారి మండలంలోని మేడిపల్లి గ్రామంలో ముదెల్లి విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం, సర్పంచ్ నారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్, చెన్నాపూర్ సర్పంచ్ గీతాశ్రీకాంత్రెడ్డి, విండో కార్యదర్శి కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ జవహర్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట మండలం నల్లమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ సుప్పాల రమేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మండల అధికారి సాయిరమేశ్గౌడ్, సహకార సంఘం సీఈవో మహిపాల్రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలకేంద్రంతోపాటు అడ్లూర్ ఎల్లారెడ్డి, తిర్మన్పల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గైని అనసూయా రమేశ్, జడ్పీటీసీ సభ్యుడు కమిలి నర్సింహులు ప్రారంభించారు. కార్యక్రమంలో విండో చైర్మన్లు కమలాకర్ రావు, మర్రి సదాశివరెడ్డి, విండో సీఈవోలు కడెం భైరయ్య, విఘ్నేశ్గౌడ్, జడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు మోహినుద్దీన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సత్యాబాయిరాజేశ్వర్రావు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు పైడి జానకి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, దేశాయిపేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు అంబర్సింగ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధ, మాజీ సర్పంచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి, భైరాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, జడ్పీటీసీ తనబుద్ధి స్వరూప, కో-ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, సొసైటీ చైర్మన్ రామకృష్ణాగౌడ్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి మండలంలోని గర్గుల్, ఇస్రోజివాడి, శాబ్దిపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, సొసైటీ చైర్మన్ పాత లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గ్యార లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నిమ్మమోహన్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్గౌడ్, సర్పంచులు చింతల రవితేజాగౌడ్, కొత్త మమత, పస్తం యాదమ్మ, పీఎసీఎస్ డైరెక్టర్ లింగం పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలంలోని బండరామేశ్వర్పల్లి, ఫరీద్పేట, వాడి, ఏల్పుగొండ, పాల్వంచ, మంథనిదేవునిపల్లి, లక్ష్మీరావులపల్లి, చుక్కాపూర్, మాచారెడ్డి, ఘన్పూర్(ఎం), రత్నగిరిపల్లి, సోమార్పేట, మైసమ్మచెరువుతండా, ఎల్లంపేట, ఇసాయిపేట, పోతారం, భవానీపేట, అక్కాపూర్, ఆరేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి, జడ్పీటీసీ రాంరెడ్డి, మాచారెడ్డి సొసైటీ చైర్మన్ పూల్చంద్నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్చంద్రం, వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భుక్యా నర్సింహులు, వైస్ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో దుర్కి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ అరుణ్ నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్యానాయక్, కార్యదర్శి గంగారాం పాల్గొన్నారు.