ఇందల్వాయి, అక్టోబర్ 24 : మండల పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కారు, డీసీఎం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏఎస్సై బాల్సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న కారుటైరు ఇందల్వాయి అటవీ ప్రాంతంలోని జాతీయ రహదారిపై పేలిపోయింది. ఈ ఘటనలో కారు.. డివైడర్ను దాటి అవతలివైపు బోల్తాకొట్టింది. అదేసమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మారుతిరెడ్డి (36) అక్కడికక్కడే మృతిచెందినట్లు ఏఎస్సై తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం టోల్ఫ్లాజా అంబులెన్స్లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.