ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్న చెట్లు
ఆర్మూర్, అక్టోబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఆర్మూర్ మున్సిపాలిటీలోని కోటార్మూర్ రెవెన్యూ ఏరియాలో గల దేవాలయాల ఆవరణల్లో వందలాది మొక్కలను ఆయా ఆలయ కమిటీల సభ్యులు, కుల సంఘాల ప్రతినిధులు నాటారు. 63వ నంబర్ జాతీయ రహదారి వెంట గల గ్రామ దేవతల ఆలయాలతో పాటు దేవాంగ, గౌడ సంఘం సభ్యులు, దళితులు, రజక సంఘాల సభ్యులు వారి కుల దేవతల ఆలయాలను నిర్మించుకున్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం స్ఫూర్తితో కుల సంఘాల ప్రతినిధులు ఆలయ పరిసరాల్లో వేలాదిగా మొక్కలను నాటి పెంచుతున్నారు. ప్రస్తుతం చెట్లు ఏపుగా పెరగడంతో ఆలయాలకు వచ్చే భక్తులకు నీడతో పాటు చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
హరితహారం స్ఫూర్తితో..
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దే వాంగ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దేవీ ఆల యం వద్ద పెద్ద సంఖ్యలో మొక్కలను నాటించాం. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగి భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-తొగర్ల రాజేశ్వర్, దేవాంగ సంఘం ప్రతినిధి, కోటార్మూర్, ఆర్మూర్
ఆహ్లాదకరమైన వాతావరణం
కోటార్మూర్లోని రేణుకా ఎల్లమ్మ ఆల య ఆవరణలో మొక్కలను నాటిం చాం. ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాం. కుటుంబ సభ్యులతో పచ్చని వాతావరణంలో సేదతీరుతున్నారు.
-జామగోని సుదన్గౌడ్,
గౌడ సంఘం ప్రతినిధి, కోటార్మూర్
లింబాద్రి గుట్టకు పచ్చని హారం
హరితహారంతో మండలంలోని లింబాద్రి గుట్ట ప్రాంతం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా మారింది. ఏపుగా పెరిగిన చెట్లు గుట్టకు పచ్చని తొడుగులా మారాయి. మొక్కలను నాటడంతో పాటు కంటికి రెప్పలా సంరక్షించడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. గుడి చుట్టూ అనేక రకాలైన ఔషధ, పండ్ల మొక్కలు ఉన్నాయి. గుట్టపైకి వెళ్లే దారి పొడవునా పెరిగిన చెట్లు పచ్చని ఆహ్వానాన్ని పలుకుతున్నాయి.
-భీమ్గల్,అక్టోబర్ 20
హరిత నిధి పంచరత్నాలు
పల్లె సీమలన్నీ పచ్చదనపు శోభ
నల్లుకొనుచు నేడు వెల్లివిరిసె
హరిత వర్ణముగను నలరారె తెలంగాణ
చెప్పనలగవి గాని మెప్పువొందె !!
ఊరులన్నీ మురిసి ఉద్యాన వనములై
పూల తేరులయ్యి పులకరించి
హాయి గొలుపుచుండె నాహ్లాదదమొందగ
పల్లె జనత మురిసి పరవశింప !!
మోడు వారినట్టి బడు భూములు శేళ్లు
శెల్కలన్ని మొలిచి తల్కులీన
హరితనిధి గ మారి మురిపెము నందించ
రాష్ట్ర ప్రభుత్వ గదిలె రయముగను !!
పరిసరాలు మారె పల్లెలన్నియు మారె
రూపురేఖలెన్నో ప్రాపుగొలిపె
భావితరమే ముందు భాతినఛందగజేసె
రాష్ట్ర అవతరమే రమ్యమగును !!
ప్రజల సేమమరిసి పరిపాలములోన
గొప్ప పథకములను కోరకుండ
తెచ్చిపెట్టి ప్రజలు మెచ్చు నాయకునిగ
కేసీయారు సారు కీర్తినొందె !!