నిజామాబాద్లో 9లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం వరి సాగుబడి.. పంట దిగుబడి.. వడ్ల కొనుగోళ్లు.. డబ్బుల చెల్లింపుల్లో గత ఏడాదిలాగే ఈసారి కూడా రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా టాప్లో ఉండాలని రాష్ట్ర, రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వానకాలం ధాన్యం సేకరణపై బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలో 9లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ససేమిరా అన్న కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి మరీ ధాన్యం కొనుగోలుపై ఆంక్షల్ని సీఎం కేసీఆర్ రద్దుచేయించారని మంత్రి చెప్పారు. గత యాసంగిలో రైతుల్ని ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు గోస పెట్టారని, ఈసారి అదే పునరావృతమైతే సహించబోమని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు పెద్దఎత్తున ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ధర్మకాంటాలను తనిఖీ చేయకపోవడంపై తూనికలు, కొలతలశాఖ అధికారులపై మంత్రి ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజామాబాద్, అక్టోబర్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిజామాబాద్ టౌన్ : వడ్ల కొనుగోళ్ల లో రాష్ట్రంలో మనమే ముందుండాలని రోడ్లు, భ వనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, వ్యవసా య, సహకార, పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖల కు చెందిన అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. వరి పంట చేతికొస్తు న్న నేపథ్యంలో గురువారం నుంచి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అవసరానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవాలని యం త్రాంగాన్ని మంత్రి వేముల ఆదేశించారు.
ట్రాన్స్పోర్టర్లపై తీవ్ర ఆగ్రహం…
గత యాసంగి సీజన్లో లారీ ట్రాన్స్పోర్టర్లు రైతులను తీవ్రంగా గోస పెట్టినట్లు తమ దృష్టికి వచ్చింద ని సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సీజన్లో 8 ఏజెన్సీల ద్వారా ధాన్యం రవాణాకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పా రు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం బస్తాల తరలింపులో నిర్లక్ష్యం వహించకూడదని గట్టిగా మందలించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చ ర్యలు తీసుకుంటామని ప్రైవేటు లారీ ఓనర్లను హె చ్చరించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ లోపాలు ఎదురు కా కుండా చూడాలని సూచనలు చేశారు. ట్రాన్స్పోర్ట ర్లు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుంచి డబ్బు లు అడుగుతున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కొంత మంది కనీసం ఫోన్ ఎత్తడం లేదని, స్పంద న కూడా ఉండడం లేదని వాపోయారు. పీఏసీఎస్ బాధ్యుల ఫిర్యాదులపై మంత్రి వెంటనే స్పందించారు. సంబంధిత కాంట్రాక్టర్లను నిలబెట్టించి ప్రశ్న ల వర్షం కురిపించారు. ఇంకోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. తీరు మార్చుకోక పోతే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. రైతుల కోసం ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చిస్తుంటే ట్రాన్స్పోర్టర్ల మూలంగా ఇబ్బందులు ఎదురవ్వ డం సహించరానిదని చెప్పా రు.
ధర్మకాంటాల తనిఖీలకు ఆదేశం…
ధాన్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ధర్మకాంటాల తనిఖీలు చేపట్టాలని తూనికలు, కొలతల శాఖ అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ధర్మకాంటాలను ఇప్పటి వరకు ఎన్ని తనిఖీలు చేపట్టారని మంత్రి ప్రశ్నించగా సంబంధిత అధికారులు సమాధానం ఇవ్వలేకపోయారు. కలెక్టర్ నారాయణ రెడ్డి కల్పించుకుని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో వేబ్రిడ్జిలతో పాటు ధర్మకాంటాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాల్సిందిగా మంత్రి వేముల ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ధర్మకాంటాల్లో మోసాలకు పాల్పడినట్లు తేలితే కఠి న చర్యలు తీసుకోవాలన్నారు. క్వింటాలు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, ‘బీ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1940 చొప్పున ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తున్నదని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రభుత్వానికి సహకరించి కొనుగోలు ప్రక్రియను సాఫీగా జరిగే విధంగా చూడాలన్నారు. ధాన్యం సేకరణతో ముడిపడి ఉన్న శాఖలకు చెందిన అధికారులంతా టీమ్ వర్క్గా పని చేయాలన్నారు. జిల్లా, డివిజన్, మం డల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం ప్రక్రియను పర్యవేక్షించాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో ఫిర్యాదులకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతులు ఎవరైనా 08462-221085 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయచ్చని చెప్పారు.
రైస్ మిల్లర్లకు చురకలు…
ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నిర్వహించిన సమీక్షాసమావేశంలో అన్ని విభాగాలపై సంపూర్ణ చర్చ జరిగింది. ప్రతి అంశాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లోతుగా విశ్లేషించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావించి సంబంధిత వర్గాలను మందలించారు. వరి కోత విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకుంటే కడ్తా బెడద ఉండబోదని మంత్రి సూచనలు చేశారు. హార్వెస్టర్తో వరి కోసినప్పుడు యంత్రంలో సర్దుబాటు చేసుకోవడం ద్వారా కడ్తా ఉండబోదని చెప్పారు. ధాన్యాన్ని నిబంధనల మేరకు తీసుకువచ్చిన రైతుల నుంచి కడ్తా పేరుతో రైస్మిల్లర్లు దోపిడీ చేయవద్దని మంత్రి కోరారు. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు రైతులందరినీ బాధ్యులను చేసి నష్టాలకు గురి చేస్తే సహించబోమని రైస్ మిల్లర్లకు మంత్రి వేముల ఘాటుగా స్పందించారు. 2020 వానకాలంలో 5.20లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించగా ఈ సారి 9లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గన్నీ బ్యాగులు కొర త లేకుండా చూస్తామని అధికారులకు మంత్రి మా టిచ్చారు. సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకు వస్తే రైతుల కోసం ముందుండి పరిష్కరించేందుకు తా నెప్పుడు సిద్ధమేనన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీ వీజీగౌడ్, కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ మకరంద్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఆయా శాఖ ల అధికారులు, ఆర్డీవోలు, పీఏసీఎస్ అధ్యక్షులు హాజరయ్యారు.
నేడు కొనుగోలు కే్ంరద్రాలను ప్రారంభించనున్న మంత్రి
వేల్పూర్, అక్టోబర్ 20 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు వేల్పూర్లో, మధ్యాహ్నం 2.30 గంటలకు భీమ్గల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు బాల్కొండ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన అన్ని మండలాల్లోని టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు మంత్రిని కలువనున్నారు. సా యంత్రం 4 గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ, సివిల్ సైప్లె అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహిస్తారు.
భారీగా వరి దిగుబడులు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో పంట దిగుబడులు, సాగు భూములు తక్కువగా ఉండేది. ఇప్పుడు పంటలు భారీగా సాగవుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రైతుల ఇబ్బందులు తొలిగిపోయాయి. నిరంత ర విద్యుత్, సాగు నీటితో పంటలు విస్తారంగా పండి దిగుబడులు భారీగా పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించడం గొప్ప విషయం.
రైతు పక్షపాతి కేసీఆర్…
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాజీ పడకుండా రూ.వేల కోట్లు వెచ్చించి రైతులకు కనీస మద్ధతు ధరను కల్పిస్తున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం విధించిన ఆంక్షలపై అలుపెరగని పోరాటం చేశారు. కేంద్ర మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఆంక్షలపై సడలింపులు తీసుకు వచ్చారు. రైతుకు మేలు చేకూర్చేందుకు సీఎం తీవ్రంగా కృషి చేశారు.