కామారెడ్డి: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా, పిట్లం మండలంలోని కుర్తి వద్ద వంతెన నీట మునిగింది. వంతెన పైనుంచి వరద నీరు ప్రవాహిస్తోంది. ఈ క్రమంలో గడిచిన 8 రోజులుగా కుర్తి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో గ్రామంలోని విద్యార్థులకు డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే వరద నీటి వల్ల విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు గ్రామం దాటే వెసులు బాటు కల్పించడం కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజాంసాగర్ 8 గేట్లు దించేశారు. దీంతో విద్యార్థులు గ్రామం దాటి బాన్సువాడ వెళ్లి పరీక్షలు రాశారు.