రెజీనా కాసాండ్ర, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘శాకిని డాకిని’. కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ కు తెలుగు రీమేక్గా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 16న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర విశేషాలు తెలిపారు. నాయిక రెజీనా కాసాండ్ర మాట్లాడుతూ…‘కొరియన్ ఫిల్మ్ను మన ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. ఇందులో యాక్షన్ కామెడీతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. నేను నివేదా కలిసి మిమ్మల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించాం’ అని చెప్పింది. నివేదా థామస్ మాట్లాడుతూ…‘ఈ కథ విన్నప్పుడే సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది. నేనూ, రెజీనా ఇప్పటిదాకా కనిపించని కొత్త పాత్రల్లో నటించాం. మా ఇద్దరి మధ్య చిరాకు పరాకులు ఉంటూనే వినోదాన్ని కలిగించే అనుబంధం ఉంటుంది’ అని చెప్పింది. ఇద్దరు ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్ను ఎలా డీల్ చేశారనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది అని నిర్మాత తాటి సునీత అన్నారు.