DMK on Nitish | బీహార్లో నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీఏ) నుంచి నితీశ్కుమార్ సారధ్యంలోని జేడీయూ బయటకు రావడంపై డీఎంకే స్పందించింది. ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు రావడం విపక్షాలకు ఆయుధంగా మారుతుందని తమిళనాడులో అధికార డీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు చేతులు కలపాలని తమ పార్టీ అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరుతున్నారని ఆర్ఎస్ భారతి తెలిపారు. బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాడాలన్న తమ అధినేత స్టాలిన్ విజన్కు బీహార్ పరిణామాలు దోహదపడతాయన్నారు.
2024 ఎన్నికల ముంగిట విపక్షాలు పుంజుకునేందుకు ఆర్ఎస్ భారతి వీలు కలుగుతుందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల కలయికతో 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి సాగనంపేందుకు వీలవుతుందని సంకేతాలిచ్చారు.