పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ బోటు ప్రమాదంలో గాయపడ్డారు. రాజధాని పాట్నాలో గంగానది స్నాన ఘాట్ల వద్ద ఛత్ పూజ ఏర్పాట్లను శనివారం పరిశీలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయన ప్రయాణించిన బోటు ఒక పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఎం నితీశ్ కుమార్ గాయపడ్డారు. ఆయన కడుపు, కాలికి గాయాలయ్యాయి. అయితే బోటులోని వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.
కాగా, సీఎం నితీశ్ కుమార్ బుధవారం కారులో వెళ్లి ఏర్పాట్లను మరోసారి పరిశీలించారు. ఈ సందర్భంగా బోటు ప్రమాదంలో తనకు అయిన గాయాలను మీడియాకు చూపించారు. అందుకే బోటులో వెళ్లి పరిశీలించడం లేదని చెప్పారు. సీటు బెల్టు పెట్టుకోలేని పరిస్థితి వల్ల కారులో వెనుక వైపు కూర్చొన్నట్లు తెలిపారు. గాయపడినప్పటికీ పనులు చేసుకుంటూ పోవాలి కదా అని 71 ఏళ్ల నితీశ్ కుమార్ అన్నారు.
మరోవైపు కొన్ని ఘాట్ల వద్ద సరైన సదుపాయాలు లేవని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. దీంతో ఆయా చోట్ల తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బీహార్లో అత్యంత ప్రసిద్ధ పండుగ ఛత్ పూజ. భక్తుల సందడి, కోలాహలం ఆ రాష్ట్రాన్ని మూడు రోజుల పాటు భారీ కార్నివాల్గా మార్చుతుంది.